Wednesday 21 March 2018

అవధానంలో వ్యస్తాక్షరి

అష్టావధానంలో వ్యస్తాక్షరి కూడా ఒక అంశం! ఒక వాక్యంలోని అక్షరాలను ఒక క్రమ పద్ధతి లో కాక అస్తవ్యస్తంగా ఒక్కో అక్షరాన్ని ఇస్తారు!ఒకసారి 3వ అక్షరం తర్వాత పదో అక్షరం తదుపరి ఐదవది ఇలా....అవధాని మనసులోనే  క్రమంలో పేర్చుకొని చివరలో వాక్యాన్ని అప్పగించాలి!

తిరుపతి వెంకట కవులు ఏకంగా ఒక అస్తవ్యస్తంగా ఇచ్చిన శ్లోకంలోని పదాలను సక్రమంగా పేర్చి అప్పగించారు!
బందరులో 18--9--1883 న జరిగిన అష్టావధానంలో ఈ విశేషం జరిగింది!
ఆ శ్లోకం  అనేక భాషాపదాలతో
ఇచ్చాడు పృచ్ఛకుడు!
ఆశ్లోకం చూడండి:
-----------------------
శా।। యూయం,తత్ర,సిడౌన్,తథాపి,వెరివెల్,తస్మా,న్మమాయా,శశీ

నోగోసార్,మదరాసు,కాయకరితం,హింగేందు ,బాయేందునం

నింగత్పూరయ,సింగకూడ,విడుదల్,నీవాడ నంటింగదా

కిస్వాస్తే మయి బోల్తహుం,అజి సునోతక్సీర్ న మేరే ఉపర్!

         అస్తవ్యస్తంగా ఇచ్చిన ఈ పదాలన క్రమంగ పేర్చి శ్లోకం అప్పగించడానికి ఎంత బుర్ర కావాలో కదా!
పృచ్ఛకుడెవరో ?ఆపదాలకు అర్థమేమిటో!
అబ్బో!అబ్బో!
తిరుపతి వెంకట కవుల సామర్థ్యం అబ్బో!

No comments:

Post a Comment